Saturday , May 18 2024
Breaking News

లిమ్రా ఫంక్షన్ హాల్ లో భారీ ఎత్తున బిజేపి, బి ఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధి మే 4:

కామారెడ్డి పట్టణంలోన లిమ్రా ఫంక్షన్ హాల్ లో గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని 18,19,41,42,43,48,49 వార్డులకు చెందిన బిజెపి, బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సుమారు 500 మంది పైగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. పార్లమెంటు ఎలక్షన్లో జహీరాబాద్ అభ్యర్థి అయిన సురేష్ షెట్కర్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని మహమ్మద్ అలీ షబ్బీర్ కోరారు.