Saturday , May 18 2024
Breaking News

కాంగ్రెస్ వాళ్లు జూటా మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు

బీజేపీ అభ్యర్థి మళ్ళీ వస్తున్నాడు మరోసారి బుద్ది చెప్పాలి

-వెంకట్రామారెడ్డి ని గెలిపించండి

మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు
-ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక:మే04,(తెలంగాణ కెరటం)
మెదక్ ఎంపీగా చదువుకున్న వ్యక్తి
ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు.శనివారం దుబ్బాక బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.కాంగ్రెస్ వచ్చాక తెలంగాణకు కష్టాలు మొదలయ్యాయని,ఐదు నెలల్లోనే అన్ని ధరలు పెరిగాయని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పే బీజేపీ,కాంగ్రెస్ లను చిత్తుగా ఓడించాలన్నారు.తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసిన మాజీ సీఎం కేసీఆర్ కు అండగా నిలబడి వెంకట్రామారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి,ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి,జెడ్పీటీసీ కడతాల రవీందర్ రెడ్డి,బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూంపల్లి మనోహర్ రావు,రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి,కత్తి కార్తీకగౌడ్,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,పలువురు పాల్గొన్నారు.