Saturday , May 18 2024
Breaking News

ఇంటింటా బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం నాయకులువీరారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు తిరుడు స్వామి

తెలంగాణ కెరటం:రాయపోల్ ప్రతినిధి: మే 4
మెదక్ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని వీరారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు తిరుడు స్వామి అన్నారు. శనివారం రాయపోల్ మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో ఇంటింటా తిరుగుతూ కార్ గుర్తుకు ఓటేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలు గుర్తించాలన్నారు. కెసిఆర్ పాలనలో పల్లెలు, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మాయ మాటలు చెప్పి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గంగరాజు ,గొల్ల శీను, వీరస్వామి, వీరేశం, మల్లేశం తదితరులు ఉన్నారు.