Sunday , May 19 2024
Breaking News

ప్రచారంలో దూసుకుపోతున్న ఎంఆర్పిఎస్ నాయకులు

  • అందరినీ సమానంగా చూసే పార్టీ బిజెపి
  • ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి ఆధ్వర్యంలో బీజేపీకి ఓట్లు వేయాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం మాచారెడ్డి మండలంలో జహీరాబాద్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ తో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం దోమకొండ మండలంలోని గొట్టిముక్కుల ( సీతారాంపూర్ ), లింగుపల్లి గ్రామాలలో కార్యకర్తలతో దళితవాడలకు వెళ్లి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిని, మతాన్ని సమానంగా చూసే పార్టీ బిజెపి పార్టీ అని అందరికీ సమన్యాయం జరగాలంటే బిజెపికి ఓటు వేయాలన్నారు.